KTR legal notices to Revanth Reddy and Bandi Sanjay: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో ఈ ఇద్దరు నేతలు మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతున్నారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Minister KTR Vs Bandi Sanjay: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా వెరైటీగా విమర్శలు గుప్పించుకున్నారు. ఉగాది పంచాంగం చెబుతూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా.. బండి సంజయ్ కూడా అదేరీతిలో కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
Teenmar Mallanna Arrest : తీన్మార్ మల్లన్న అరెస్ట్ను బండి సంజయ్ ఖండించాడు. కేసీఆర్ నీకు మూడిందంటూ ఫైర్ అయ్యాడు. దొంగల్లా వచ్చి పోలీసులు మల్లన్నను ఎత్తుకుపోతారా? అంటూ నిలదీశాడు.
Teenmaar Mallanna Wife : ప్రభుత్వం చేస్తోన్న పనులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుడటం, విమర్శలు చేస్తుండటంతోనే ఇలా అరెస్ట్ చేశారని, ఆయనకు ఏం జరిగినా కేసీఆర్దే బాధ్యత అని మల్లన్న భార్య చెప్పుకొచ్చింది.
Bandi Sanjay On Teenmar Mallanna Arrest: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ అరెస్ట్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తారా..? అని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. తక్షణమే అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ చేశారు.
TSPSC Paper Leakage Case: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేసిన కేసీఆర్ ఇవాళ కార్యకర్తలకు లేఖ రాసిన తీరే ఎన్నో సందేహాలను తావిచ్చిందన్నారు. కేసీఆర్ కార్యకర్తలకు రాసిన లేఖను ఉద్దేశిస్తూ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ పోరాటం ఉధృతం చేసింది. 'మా నౌకర్లు మాక్కావాలె' నినాదంతో అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ దీక్ష చేపట్టనుంది. మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేసే వరకు ఉద్యమం ఆగదని బండి సంజయ్ హెచ్చరించారు.
Bandi Sanjay Press Meet: తన విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా తాను భావించడం లేదన్న బండి సంజయ్.. మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలి అని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చాను అని తెలిపారు.
Serious Warning to Bandi Sanjay: ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు ఢిల్లీ రమ్మని కోరిన సమయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు ఉన్నారని ఆరోపించడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యుడు మంత్రి కేటీఆర్ అని అన్నారు. ఆయనను బర్తరఫ్ చేయాలన డిమాండ్ చేశారు.
Bandi Sanjay On Tspsc Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ స్పందించారు. దీనికి పెద్ద కుట్రదాగి ఉందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరమని ఫైర్ అయ్యారు. గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం కూడా లీక్ అయినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని అన్నారు.
Bandi Sanjay On MLC Kavitha: బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. టీచర్ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్లో భయం మొదలైందన్నారు.
Bandi Sanjay Satires on Kavitha and KTR: కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంటులో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
Revanth Reddy Karimnagar Speech: 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి 2004 లో ఇదే గడ్డపై నుంచి తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మాట ఇచ్చారు. మాట తప్పక మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Fake Birth Certificates In Hyderabad: కేసీఆర్ పాలనలో పాత బస్తీ ఐఎస్ఐ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. అడుగడుగునా స్లీపర్ సెల్స్ని పెంచి పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, ఉగ్రదాడులు జరిగినా.. వాటి మూలాలు పాతబస్తీలోనే బయటపడుతున్నాయి. అయినప్పటికీ కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదు అని బండి సంజయ్ మండిపడ్డారు.
Ponguleti Srinivas Reddy's Delhi Visit: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంలో కొత్తేం ఉంది అని అనుకోకండి. ఎప్పుడూ వ్యాపార పనులపై వెళ్లడం వేరు.. ఈసారి తన రాజకీయ పనులపై వెళ్లడం వేరు అంటున్నాయి పొంగులేటి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయవర్గాలు.
Bandi Sanjay Comments On CM KCR: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల నేతలు రాసిన లేఖపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సంతకాలే లేకుండా లెటర్లు ఎలా రాశారంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని.. ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Bandi Sanjay Allegations on Preethi Death Case: ఒక వర్గానికి చెందిన నిందితుడికి కొమ్ముకాస్తున్నారని.. అందుకే ప్రీతి మృతి విషయంలో వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరించారు అని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రీతి చనిపోయిన తరువాత పోలీసులు ఆమె మొబైల్ అన్లాక్ చేసి ఆధారాలను మాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.