BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే ఆఫర్.. రూ.298 రీఛార్జీప్లాన్‌తో 2 నెలల వ్యాలిడిటీ..

BSNL 2 Months Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే ఆకర్షణీయమైన ప్లాన్లను ముందుకు తీసుకు వస్తుంది. టెలికాం ధరలు పెరిగిన తర్వాత ఇతర ప్రైవేటు కంపెనీలు ధరలను భారీగా పెంచాయి. కానీ, ప్రభుత్వ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తుంది. కేవలం రూ.298 రీఛార్జీ చేస్తే 2 నెలల వరకు వ్యాలిడిటీ లభించే అద్భుతమైన ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ మైండ్‌ బ్లోయింగ్‌ రీఛార్జీ ప్లాన్ రూ. 298 ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే 58 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం.  

2 /7

ఈ ప్లాన్‌లో 52 జీబీ డేటా కూడా పూర్తి రోజులు వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఉచితంగా పొందుతారు. ప్రతిరోజు 1 జీబీ డేటా పొందవచ్చు. అంటే వాయిస్‌ కాలింగ్‌ ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ ప్లాన్‌ అద్భుతం.  

3 /7

బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో ప్లాన్‌ కూడా ఉంది. ఇందులో రూ.249 రీఛార్జీప్లాన్‌ వ్యాలిడిటీ 45  రోజులు వర్తిస్తుంది. ఇందులో కూడా ప్రతిరోజూ 2 జీబీ డేటా కూడా పొందుతారు.  

4 /7

భారత టెలికాం కంపెనీలను షేక్‌ చేస్తుంది బీఎస్‌ఎన్‌ఎల్‌. దీంతో ఇతక ప్రైవేటు టెలికాం కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇస్తుంది.  

5 /7

జూన్‌ నెలలో టెలికాం ధరలు పెంచడంతో జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు రీఛార్జీ ధరలు అమాంతం పెంచేశాయి. అయితే ఇప్పటికీ ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్లు అందిస్తుంది.  

6 /7

ఇప్పటికే విస్తృత స్థాయిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు కూడా విస్తరిస్తోంది. నిన్న లోగో రంగు, క్యాప్షన్‌ కూడా మార్చిన సంగతి తెలిసిందే.  

7 /7

వచ్చే ఏడాది వరకు 5జీ సేవలు ప్రారంభించే దిశలో అడుగులు వేసింది. ఇప్పటికే టెస్టింగ్‌లు కూడా చేసిన సంగతి తెలిసిందే.