Electric car: మెర్సిడెస్ ఫీచర్లు..తీస్లా లుక్..అద్దిరిపోతున్న ఇండియన్ మేడ్ కారు

దేశంలో ప్రస్తుతం ఓ కారు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ కారు ప్రత్యేకతలు తెలుసుకుంటే ఫిదా అయిపోతారు. 
  • Dec 16, 2020, 21:23 PM IST

Electric car: దేశంలో ప్రస్తుతం ఓ కారు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ కారు ప్రత్యేకతలు తెలుసుకుంటే ఫిదా అయిపోతారు. 

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల పట్ల ప్రజల్లో క్రేజ్ పెరుగుతోంది. అందుకే దేశ విదేశీ కంపెనీలు ఈ రంగంలో ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం భారతీయ స్టార్టప్ కంపెనీ ప్రవాగ్ డైనొమిక్స్..ప్రీమియర్ ఎలక్ట్రిక్ సెడాన్ ను ప్రవేశపెడుతోంది. ఈ కారు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే మెర్సిడెస్ ప్రత్యేకతలతో తీస్లా కారులా కన్పిస్తోంది..

1 /4

కంపెనీ ఈ కారు  బ్యాటరీ ప్యాక్ ను ఫాస్ట్ ఛార్జింగ్ పరిజ్ఞానంతో కూడా కూడి ఉంది. కేవలం 30 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుంది.

2 /4

ఈ కారులో 96 kwh బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఇది 150 kwh శక్తిని ఇవ్వగల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ శక్తితో ఈ కారు  100 kmph వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకుంటుంది.

3 /4

ఈ కారు పూర్తిగా ఇండియాలోనే నిర్మితమైంది. 90 శాతం స్పేర్ పార్ట్స్ కూడా ఇండియావే. సబ్ స్క్రిప్షన్ సర్వీస్, లీజ్ ఆఫర్ తో కంపెనీ ఈ కారు ప్రవేశపెడుతోంది.

4 /4

ప్రస్తుతం ఈ కారు భారతీయ రోడ్లపై  టెస్టింగ్ లో ఉంది. 2021లో లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఈ కారు ధర కూడా చాలా తక్కువ ఉండవచ్చనే అంచనా ఉంది.