Mahesh Babu: మహేష్ బాబు హీరోయిజంకు 21 ఏళ్లు

మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ విషయానికొస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారీ పాట సినిమాతో ( Sarkar vaari paata) బిజీగా ఉన్నాడు. 'గీతా గోవిందం' ఫేమ్ పరాశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ ( Keerthy Suresh ) జంటగా నటిస్తోంది.

Last Updated : Jul 31, 2020, 02:43 AM IST
Mahesh Babu: మహేష్ బాబు హీరోయిజంకు 21 ఏళ్లు

మహేష్ బాబు రాజకుమారుడు ( Mahesh Babu's Rajakumarudu) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి 21 ఏళ్లు పూర్తయింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ హీరోయిజంకు కూడా 21 ఏళ్లు అన్నమాట. ఈ క్రమంలో కొన్ని ఫెయిల్యూర్స్‌ని కూడా చూసినప్పటికీ... అవేవీ మహేష్ బాబు 'దూకుడు'ను తగ్గనివ్వలేదు. 'ఒక్కడు'తో మాస్ హీరోగా అవతారమెత్తిన మహేష్ బాబు ఆ తర్వాత 'పోకిరి'గా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ అంటే 'పోకిరి'కి ముందు.. 'పోకిరి'కి తర్వాత అని చెప్పుకునే స్థాయిలో ఆ సినిమా బాక్సాఫీస్‌ని ఏలింది. మహేష్ బాబు కెరీర్‌లో ఇప్పటి వరకు కేవలం 25 సినిమాలు మాత్రమే ఉన్నప్పటికీ బాక్సాఫీస్ స్టామినా విషయానికి వస్తే 'అతడు' నిజంగానే సూపర్ స్టార్. Also read: Mahesh Babu: సర్కార్ వారి పాట.. ఫ్యాన్స్‌ని సస్పెన్స్‌కి గురిచేస్తోన్న పోస్టర్‌

1979 లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేసిన తరువాత, మహేష్ తొమ్మిది సినిమాల్లో నటించాడు, ఆ తరువాత, అతను 24 సంవత్సరాల వయస్సులో రాజ కుమారుడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. మహేష్ బాబు సరసన బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా జంటగా నటించింది. అ సినిమాకి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారు. Also read: Hardik Pandya: పెళ్లి కాకుండానే తండ్రిగా అయిన హార్థిక్ పాండ్యా

1999లో జూలై 30న విడుదలైన 'రాజ కుమారుడు' సినిమాకు 21 సంవత్సరాలు ( 21 years of Rajakumarudu) పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు తన తొలి చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేశాడు. దర్శకుడు రాఘవేంద్రరావు తన తొలి సినిమాని ప్రత్యేకం అయ్యేలా చేసినందుకు ధన్యవాదాలు అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. Also read: Tollywood: లాక్‌డౌన్‌లో కూడా ఆగని అతడి సంపాదన

మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ విషయానికొస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారీ పాట సినిమాతో ( Sarkar vaari paata) బిజీగా ఉన్నాడు. 'గీతా గోవిందం' ఫేమ్ పరాశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ ( Keerthy Suresh ) జంటగా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలోని ఆర్థిక మోసాల చుట్టూ తిరిగే కథనంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. లాక్‌డౌన్ అనంతరం కొవిడ్-19 ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం, సూపర్ స్టార్ పిల్లలు గౌతమ్, సితారాతో కలిసి తన క్వారంటైన్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. Also read: Apsara Rani థ్రిల్లర్ ట్రైలర్.. హాట్ సీన్లతోనే కథ!

Trending News