DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. 4 శాతం డీఏ పెరుగుదల!

4 Percent DA Hike For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జాక్‌పాట్‌ లభించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించి డీఏను ప్రభుత్వం భారీగా పెంచింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం ఉద్యోగులకు కానుక ఇచ్చింది. డీఏ పెరుగుదలపై ప్రకటన చేసింది.

1 /6

ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ జాక్‌పాట్‌ లభించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం భారీ కానుక అందించింది. డీఏ పెరుగుదలను ప్రకటించింది.

2 /6

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవగా ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.89 లక్షల కోట్ల బడ్జెట్‌ను చదివి వినిపించారు.

3 /6

స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 6.8 శాతం పెరిగింది. ఇది భారతదేశ మొత్తం వృద్ధి రేటు 6.37 శాతం కంటే ఎక్కువ ఉందని ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో వెల్లడించారు.

4 /6

ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. బోధన, బోధనేతర సిబ్బందితోపాటు పింఛన్‌దారులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌పై కీలక ప్రకటన చేసింది. డీఏలో నాలుగు శాతం పెరుగుదల ఉంటుందని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు.

5 /6

డియర్‌నెస్‌ అలవెన్స్‌ 4 శాతం పెంపుతో 6వ వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా మొత్తం డీఏ 18 శాతం చేరుకుంటుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీగా లబ్ధి చేకూరనుంది.

6 /6

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం డీఏ పెంపుతోపాటు జీతాల పెరుగుదల చేస్తుండడంతో ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల ఉద్యోగులు కూడా డీఏ, జీతాల పెంపుపై డిమాండ్‌లు మొదలవుతున్నాయి.