PM Modi: మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్.. విజయ వంతంగా ముగిసిన మోదీ 45 గంటల ధ్యానం..

Kanyakumari: ప్రధాని మోదీ కన్యాకుమారీలో చేపట్టిన 45 గంటల ధ్యానం విజయవంతంగా పూర్తయింది. ఆయన ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడలేదని సమాచారం. కేవలం మౌనంగా ఉంటూ,  కొబ్బరినీళ్లు, ద్రాక్షారసం మాత్రమే తీసుకుని ధ్యానం పూర్తి చేశారు.

1 /6

ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికలు ముగియగానే తమిళనాడుకు చేరుకున్నారు. అక్కడ భగవతీ అమ్మాన్ ఆలయంను దర్శించుకున్నారు. ఈ ఆలయం 108 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్తుంటారు. ఇక్కడి నుంచి కన్యాకుమారీ చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకనంద రాయ్ మెమోరియల్ వద్దకు వెళ్లారు.

2 /6

మోదీ.. మే 30 న సాయత్రం కన్యాకుమారీలో 45 గంటల దీక్షను ప్రారంభించారు. గతంలో స్వామి వివేక నంద ఇదే ప్రాంతంలో మూడు రోజుల పాటు మౌనంగా దీక్ష ను చేపట్టారని చెబుతుంటారు.

3 /6

వివేక నంద స్మారక ప్రదేశంలో మండపం, బయటవైపు, లోపల మోదీ ధ్యానం చేశారు. మోదీ దీక్ష చేపట్టినప్పుడు.. కాషాయ దుస్తులు ధరించి, తొలుత సూర్యుడిని నమస్కారాలు చేశారు. భగవాన్ సూర్యుడికి అర్ఘ్యం వదిలి దీక్షను ప్రారంభించారు.

4 /6

చేతిలో జపమాలను ధరించి, అకుంఠిత  దీక్షతో ఆయన ఈ 45 గంటల దీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రధాని మోదీ దేవీ పాదం వద్దకూడా ధ్యానం చేశారని తెలుస్తోంది. ఏకాగ్రత చిత్తంలో ఆ దేవుడ్ని ధ్యానిస్తు, జపమాలతో దేవుడిని కొలుచుకుంటూ పూజలు చేశారు. 

5 /6

చివరిదశ ఎన్నికల ప్రచారం ముగియగానే మోదీ.. తమిళనాడులోని భగవతీ అమ్మాన్ ఆలయంకు చేరుకున్నారు. అక్కడ బోటులో రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవీ చిత్రపటాలకు పూలమాలలు వేశారు.

6 /6

మోదీ ధ్యానం చేసిన ప్రదేశం.. వివేకానంద శిలా స్మారకం కన్యాకుమారీ నుంచి 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.  వసతురాయ్ బీచ్ నుంచి ఇక్కడకు  చేరుకోవచ్చు. ఈ ప్రదేశంలో బంగాళా ఖాతం, అరేబియా సముద్రం, హిందు మహా సముద్రంలు ఒకే చోట కలుస్తాయి. ఈ ప్రదేశం చూడటానికి ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది.