Ramzan 2024: షబ్బీర్‌ అలీ ఇంట్లో రంజాన్‌ విందు.. తెలంగాణ రాజకీయం 'పసందు'

Telangana Minisiters Ramzan Lunch At Shabbir Ali Residence: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ నివాసంలో తెలంగాణ మంత్రులు రంజాన్‌ విందు చేశారు. నిన్న రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా రాగా.. గురువారం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితోపాటు పార్టీ నాయకులు తదితరులు షబ్బీర్‌ అలీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తయారుచేయించిన వంటకాలను మంత్రులు రుచి చూశారు.

1 /8

Ramzan 2024: హైదరాబాద్‌లోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ నివాసంలో ఆనందోత్సాహాలతో రంజాన్‌ పండుగ

2 /8

Ramzan 2024: ముందు రోజు షబ్బీర్‌ అలీ ఇంటికి వెళ్లి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌ రెడ్డి

3 /8

Ramzan 2024: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితోపాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు.

4 /8

Ramzan 2024: మంత్రుల కోసం పలు రకాల వంటలను ప్రత్యేకంగా తయారుచేయించిన షబ్బీర్‌ అలీ

5 /8

Ramzan 2024: మాంసాహారంతోపాటు బిర్యానీ, స్వీట్ల వంటకాలతో డైనింగ్‌ టేబుల్‌ నిండిపోయింది.

6 /8

Ramzan 2024: బిర్యానీ, షీర్‌ ఖుర్మా, డబుల్‌ కా మీఠా, హలీమ్‌ ప్రత్యేకంగా దగ్గరుండి షబ్బీర్‌ అలీ వడ్డించారు.

7 /8

Ramzan 2024: మంత్రుల రాక సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు.

8 /8

Ramzan 2024: రంజాన్‌ విందు కూడా రాజకీయ వివాదానికి దారితీసింది. రేవంత్‌ రెడ్డి ఒక్కరే ప్రత్యేకంగా రావడం.. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులుగా ఉన్న మంత్రులు ఒక బృందంగా రావడం కలకలం రేపింది. పార్టీ రెండు వర్గాలుగా చీలిందనే ప్రచారం జరుగుతోంది.