Telangana Govt Pending DAs: ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. పెండింగ్ డీఏలకు గ్రీన్ సిగ్నల్..?

Pending DAs in Telangana: పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు ఇవ్వాలని చాలా రోజులుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా తమకు డీఏలను రిలీజ్ చేయాలని ఇటీవల సమావేశంలో కోరారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీకి ఆహ్వానం పంపించారు. పెండింగ్ డీఏలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.
 

1 /5

బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.   

2 /5

ఈ సమావేశంలో 30 మంది డెలిగేట్స్ పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు 6 ప్రధాన డిమాండ్లు ఉంచనున్నారు.  

3 /5

ఉద్యోగుల ఇతర 51 సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు.   

4 /5

త్వరలో క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో ఎంప్లాయీస్ యూనియన్స్‌తో సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  

5 /5

పెండింగ్ డీఏలకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఉద్యోగులకు భారీ లబ్ధి చేకూరనుంది. ఈ విషయంపై మరికాసేపట్లో స్పష్టత రానుంది.