Whatsapp Accounts Blocked: ఆ 50 లక్షల భారతీయ ఎక్కౌంట్లు ఎందుకు బ్లాక్ అయ్యాయి

ఇండియాలో కొత్త ఐటీ నిబంధనలు అమల్లో వచ్చాయి. సోషల్ మీడియా కంపెనీలు ఇందుకు అనుగుణంగా నివేదికలు వెలువరిస్తున్నాయి. దేశంలో గత రెండు నెలల్లో అంటే జూలై- ఆగస్టులో ఏకంగా 50 లక్షలకు పైగా భారతీయుల వాట్సప్ ఎక్కౌంట్లను ఆ సంస్థ బ్లాక్ చేసింది. అంతకుముందు జూలైలో సైతం లక్షల్లో ఎక్కౌంట్లు నిషేధించింది. కారణాలేంటనేది పరిశీలిద్దాం

Whatsapp Accounts Blocked: ఇండియాలో కొత్త ఐటీ నిబంధనలు అమల్లో వచ్చాయి. సోషల్ మీడియా కంపెనీలు ఇందుకు అనుగుణంగా నివేదికలు వెలువరిస్తున్నాయి. దేశంలో గత రెండు నెలల్లో అంటే జూలై- ఆగస్టులో ఏకంగా 50 లక్షలకు పైగా భారతీయుల వాట్సప్ ఎక్కౌంట్లను ఆ సంస్థ బ్లాక్ చేసింది. అంతకుముందు జూలైలో సైతం లక్షల్లో ఎక్కౌంట్లు నిషేధించింది. కారణాలేంటనేది పరిశీలిద్దాం

1 /5

జూన్ 16 నుంంచి జూలై 31 మధ్యకాలంలో దాదాపు 30 లక్షల ఎక్కౌంట్లను వాట్సప్ నిషేధించింది. ఆ నెలలో 594 ఫిర్యాదులు అందాయి. నిషేధిత కంటెంట్‌ను షేర్ చేసినందున ఈ చర్యలు తీసుకుంది. 

2 /5

ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల ఎక్కౌంట్లను తొలగించగా..అందులో భారతీయులవే 20 లక్షలకు పైగా ఉన్నాయి. 420 ఫిర్యాదుల్ని పరిశీలించిన అనంతరం 41 ఎక్కౌంట్లపై తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.

3 /5

నిషేధిత 20 లక్షల 70 వేల అక్కౌంట్లలో ఎక్కువగా బల్క్ మెస్సేజ్‌లను అనధికారికంగా వాడినందున ఆ ఎక్కౌంట్లను నిషేధించామని వాట్సప్ వెల్లడించింది.

4 /5

ఇందులో భాగంగా ఒక్క ఆగస్టు నెలలోనే 20 లక్షలకు పైగా భారతీయుల ఎక్కౌంట్లను నిషేధించామని వాట్సప్ తెలిపింది. ఆగస్టు నెలలో 420 ఫిర్యాదులు వచ్చాయని మంత్లీ కంప్లయెన్స్ రిపోర్ట్‌లో వెల్లడించింది. 

5 /5

2021 మే నెలలో అమల్లో వచ్చిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం వాట్సప్ ఎప్పటికప్పుడు నివేదిక వెలువరిస్తోంది. ఎప్పటికప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎక్కౌంట్లను నిషేధిస్తోంది. లక్షలాది ఎక్కౌంట్లను ఇప్పటి వరకూ బ్లాక్ చేసింది వాట్సప్.