Tirumala: చరిత్రలో తొలిసారిగా.. తిరుమల వెంకన్నకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

Tirumala:  తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం ఒక్కరోజే  రూ.6 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించింది. 
 

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 03:50 PM IST

Tirumala Hundi Income: మునుపెన్నడూ లేనివిధంగా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో స్వామి వారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామివారికి ఆదివారం ఒక్కరోజులోనే భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌లు రికార్డు సృష్టించాయి. తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా ఆదివారం ఒక్క‌రోజే ఏకంగా 6 కోట్ల‌కు పైగా హుండీ ఆదాయం ల‌భించింది. ఆదివారం విరాళాల విలువ 6 కోట్ల 18 లక్షలుగా తేలింది. ఇప్ప‌టిదాకా తిరుమ‌ల వెంక‌న్న హుండీకి ఒక‌రోజు అత్య‌ధికంగా ల‌భించిన ఆదాయం 5 కోట్ల 73 లక్షలు. ఈ హుండీ ఆదాయం 2012 ఏప్రిల్ 1న ల‌భించింది

Video ThumbnailPlay icon

Trending News