ఈసీ నోటీసులకు స్పందించిన పోసాని కృష్ణమురళి

ఈసీ నోటీసులకు స్పందించిన పోసాని కృష్ణమురళి

Last Updated : Mar 21, 2019, 02:50 PM IST
ఈసీ నోటీసులకు స్పందించిన పోసాని కృష్ణమురళి

ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ ఆయనపై పోసాని కృష్ణమురళి పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ టీడీపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడిపి నేతల ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. పోసాని కృష్ణమురళికి నోటీసులు జారీచేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం తమ నోటీసుల్లో పోసానిని ఆదేశించింది.
 
అయితే, ఎన్నికల సంఘం నోటీసులపై స్పందించిన పోసాని కృష్ణమురళి.. సీఎం చంద్రబాబుపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇస్తూ ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాను ప్రస్తుతం తాను నడవలేని స్థితిలో ఉన్నానని, ఆపరేషన్‌ కోసం ఆస్పత్రిలో చేరానని ఎన్నికల సంఘానికి తెలిపారు.

Trending News