బిజేపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన ఒడిశా ముఖ్యమంత్రి

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బిజేపూర్ అసెంబ్లీ స్థానానికి ఆదివారం రాజీనామా చేశారు.

Last Updated : Jun 2, 2019, 08:45 PM IST
బిజేపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన ఒడిశా ముఖ్యమంత్రి

భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బిజేపూర్ అసెంబ్లీ స్థానానికి ఆదివారం రాజీనామా చేశారు. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బిజేపూర్, హింజిలి అనే రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల్లో పోటీ చేసిన ఆ రెండు స్థానాల నుంచి గెలుపొందిన నవీన్ పట్నాయక్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదవసారి బాధ్యతలు చేపట్టిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే ఆయన బిజేపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. 

బిజేపూర్ ఎమ్మెల్యేగా నవీన్ పట్నాయక్ రాజీనామా చేయడంతో మరో ఆరు నెలల్లో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. సీఎం నవీన్ పట్నాయక్ ఇకపై హింజిలి అసెంబ్లీ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించనున్నారు.

Trending News