Chhaava Beauty rashmika mandanna: రష్మిక మందన్న ఇటీవల చావా మూవీ రిలీజ్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
రష్మిక మందన్న, విక్కికౌశాల్ జంటగా నటించిన హిస్టారికల్ మూవీ ఛావా ఈరోజు విడుదలైంది.ఈ మూవీకి ప్రస్తుతం ఫ్యాన్స్ నుంచి మంది ఆదరణ లభించింది. ఈ మూవీలో రష్మిక బాగా నటించిందని, విక్కికౌశాల్ సినిమాకు కూడా అద్భుతంగా నటించాడని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు
మరాఠా యోధులు ఛత్రపతి శివాజీ మహారాజ్ శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ కోసం రష్మిక ఎంతో కష్టపడ్డారని కూడా మూవీ టిమ్ వెల్లడించింది.ఈ మూవీ మంచి టాక్ రావడంతో తాజాగా.. నటి రష్మిక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ.. తనకు శంభాజీ మహారాజ్ సతీమణిగా నటించే అవకాశం రావడం తన లక్ అని అన్నారు. ఈ మహారాణి పాత్ర కోసం తాను.. వంద శాతం కష్టపడ్డానని అన్నారు.ఈ సినిమాలో రష్మికను ఎంపిక చేసేటప్పుడు కొంత మంది మరాఠాలో ఎవరు దొరకలేదా..అని ట్రోల్స్ సైతం చేశారు.
అవన్నింటికి అధిగమించి రష్మిక ఈ మూవీలో సూపర్ గా నటించారు. అంతేకాకుండా.. తన కాలు ఫ్యాక్చర్ అయిన కూడా ఆమె ఛావా మూవీ ప్రమోషన్ లలో పాల్గొన్నారు. అయితే.. రష్మిక తాజాగా.. తనకు స్టోరీ నచ్చితే.. ఎలాంటి పాత్రలు చేయడానికైన వెనుకాడనని అన్నారు.
నలుగురు పిల్లల తల్లిగా లేదా బామ్మ పాత్రలు వేయడానికి సైతం వెనుకాడనని రష్మిక స్పష్టం చేశారు. తాను సినిమాలో నటించి ఈ విధంగా పాపులారిటీ సంపాదిస్తానని ఎన్నడు అనుకోలేదన్నారు. తనకష్టమే తనను ఈ విధంగా పాన్ ఇండియా హీరోయిన్గా నిలబెట్టిందని అన్నారు.
ప్రస్తుతం రష్మిక మందన్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న దిగర్ల్ ఫ్రెండ్, సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబోలో వస్తున్న సికిందర్, ధనుష్ శేఖర్ కమ్ముల మూవీ కుబేర చిత్రాల్లో నటిస్తూ ఈ అమ్మడు బిజీగా ఉన్నారు.