Naga babu insta post: మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన ఇన్ స్టా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో పోస్ట్ లు పెడుతుంటారు.
ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జనసేన పార్టీ కార్యకలాపాల్లొ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మెగా బ్రదర్ ఇన్ స్టాలో చేసిన పోస్టు వార్తలలో నిలిచింది.
నాగబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మోగా హీరో నాగబాబు ఇన్ స్టా వేదికగా.. ఒక పోస్ట్ పెట్టారు. ఆయన గత 14 ఏళ్లుగా పెంచుకుంటున్న పెంపుడు శునకం చనిపోయింది. దీనితో వారి కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది.
ముఖ్యంగా నిహరిక తన ఇంట్లోని పెట్ డాగ్ ను అస్సలు వదిలేది కాదు. దాన్ని ఎంతో ప్రేమగా, ఇంట్లోని మనుషుల్లానే ట్రీట్ చేసేవారు. దీంతో అకస్మాత్తుగా పెట్ డాగ్ చనిపొవడంతో ఇంట్లోని వారంత ఎమోషనల్ అయ్యారు.
దీనిపై నాగబాబు పెట్ డాగ్ తో వారి కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పెంపుడు శునకం ఎప్పుడు తమ గుండెల్లో ఉంటుందని నాగబాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పెట్ డాగ్ తమ చుట్టు తిరుగుతూ.. అది తోక ఊపుకుంటూ చేసే పనులు చూస్తుంటే ఫన్నీగా అన్పించేందని, టెన్షన్ అంతా దూరమైపోయేదని నాగాబాబు రాసుకొచ్చారు.
తమ పెట్ డాగ్ ఆత్మకు శాంతి కల్గాలని కూడా నాగబాబు ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు. నిహారిక కొణిదెల సైతం పెంపుడు శునకం చనిపోవడం పట్ల ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగబాబు చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.