Telangana: భానుడి భగభగలు షురూ.. నేటి నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు..

Telangana Weather Update: మొన్నటి వరకు చలి చంపేసింది. ఇక ఎండాకాలం వంతు. నేటి నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నేటి నుంచి పొడి వాతావరణం ఏర్పడనుంది.
 

1 /5

తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల ఎక్కువగా ఈరోజు నుంచి నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న, మొన్నటి వరకు చలి తీవ్రత పెరగడం, పొగ మంచు కమ్మేయడం జరిగింది.  

2 /5

ఇప్పుడు ఎండ తీవ్రత పెరగనుంది. ఫిబ్రవరి నెల కూడా కావడంతో ఎండ తీవ్రత పెరగనుంది. ఈనెల 28వ తేదీ మహాశివరాత్రి తర్వాత ఎండ కాలం ప్రారంభం అవుతుంది. అయితే, ముందుగానే మధ్యాహ్నం ఎండ తీవ్రత కూడా పెరుగుతోంది.  

3 /5

కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం నేటి నుంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో భానుడి ప్రతాపం మొదలు అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.  

4 /5

చలికాలం పూర్తయిందా? అనేలోగా ఎండకాలం కూడా మొదలైపోయింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం పొడి వాతావరణం, ఉక్కపోత తప్పదు. భానుడి భగభగలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది.  

5 /5

అయితే, ఈ సమయంలో వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సూచించింది. అయితే, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మూడు రోజులు చలి తీవ్రత అలాగే ఉంటుందని చెప్పింది.