Tirumala: పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడు.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అభయం..

Tirumala Brahmotsavam Photos: తిరుమల శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న శుక్రవారం తిరుమల శ్రీవారు తిరు మాడవీధుల్లో పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా అభయం ఇస్తూ భక్తులను కనువిందు చేశారు.
 

1 /7

తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 4 నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశుడు పెద్ద శేష వాహనంపై మొదటిరోజు అయిన శుక్రవారం నాడు స్వర్ణ శేషవాహనంపై తిరువీధుల్లో ఊరేగి భక్తులను కనువిందు చేశాడు  

2 /7

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలమంది భక్తులు తిరుమలకు చేరుకుని వేంకటేశుని దర్శనం కోసం కొన్ని గంటలపాటు బారులు తీరతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారే మాడవీధుల్లో స్వర్ణ శేష వాహనంపై ఊరేగుతూ కనువిందు చేశాడు.  

3 /7

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదటి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చాడు.  

4 /7

ఆదిశేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు. ఆయన లక్ష్మణుడిగా,బలరాముడిగా శ్రీమన్నారాయణుడిగా నిత్యం తోడుగా ఉన్నాడు. స్వామివారిని సేవిస్తూ భక్తి చాటుకున్నాడు.  

5 /7

కాగా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం 14 కళాబృందాలు 410 మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో ఒడిస్సీ, మయూర, యక్షగానం, వీరగాశ, విద్యార్థులు కోలాటలతో ప్రదర్శనలు చేసి మంత్ర ముగ్దులను చేశారు.  

6 /7

ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్వామి వారిని దర్శించుకుని సతీసమేతంగా పట్టువస్త్రాలను సమర్పించారు.తిరుమల పుణ్య క్షేత్రంలో కేవలం గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలన్నారు.  

7 /7

అంతేకాదు భక్తులకు అన్ని సౌకర్యాలు తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. టీటీడీ యాజమాన్యం కూడా పారిశుద్ధ్యం, ప్రసాదం వంటి సౌకర్యాలను కల్పిస్తుంది. భక్తులు వినియోగించుకోవాలని కోరారు.