Hanamkonda: హనుమకొండ జిల్లాలో విషాదం...క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం

Hanumakonda: తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. క్వారీలో టిప్పర్ లారీ బోల్తా పడి ముగ్గురు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 02:06 PM IST
  • హనుమకొండ జిల్లాలో విషాదం
  • క్వారీలో టిప్పర్‌ బోల్తా పడి ముగ్గురి మృతి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Hanamkonda: హనుమకొండ జిల్లాలో విషాదం...క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం

Tipper Bolta in Hanamkonda: తెలంగాణ హనుమకొండ జిల్లా(Hanumakonda District)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాజీపేట మండలం తరాలపల్లి శివారు గాయత్రి క్వారీలో టిప్పర్ బోల్తా(Tipper Bolta) పడి ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో రాష్ట్రానికి చెందినవారు ఇద్దరు కాగా... మరొకరు ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చందు, గూడురు మండలం బొద్దుగొండకు చెందిన ముఖేష్, జార్ఖండ్‌కు చెందిన అఖీమ్.. ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. 

వేగంగా వచ్చిన టిప్పర్ అదుపుతప్పి క్వారీలో పనిచేస్తున్న ముగ్గురిపై పడటంతో ఈ ప్రమాంద జరిగింది. ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో క్వారీలో పనిచేసే కార్మికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రి(MGM Hospital)కి తరలించారు. మడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Car Accident at Gachibowli: గచ్చిబౌలిలో కారు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News