Journalist Manoj died of COVID-19 | హైదరాబాద్, జూన్ 10 : కరోనావైరస్తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో కన్నుమూసిన హైదరాబాద్ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్య వైఖరే కారణం అని ఆరోపించారు ఆయన సోదరుడు సాయినాథ్. గాంధీ ఆస్పత్రిలో ఉన్న లోపాలపై సాయినాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ పేషెంట్స్ను ఆస్పత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందువల్లే తన సోదరుడు మనోజ్ కుమార్ మృతి చెందారని సాయినాథ్ ఆరోపించారు.