Meenakshi Chaudhary: మహేష్ బాబు సినిమాలో అవమానం.. కానీ అందుకే ఇప్పుడు సత్కారం

Meenakshi Chaudhary Upcoming Movies: ఈ మధ్యనే మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో కనిపించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ పరిస్థితి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.. ఇంతకీ సంగతేమిటంటే..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 6, 2024, 07:49 PM IST
Meenakshi Chaudhary: మహేష్ బాబు సినిమాలో అవమానం.. కానీ అందుకే ఇప్పుడు సత్కారం

Meenakshi Chaudhary: సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చుట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మీనాక్షి చౌదరి. మొదటి సినిమా ఈమెకు ఆశించినంత విజయం తెచ్చి పెట్టలేదు. అయితే అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టింది. వెంటనే రవితేజ చిత్రం ఖిలాడీలో అవకాశం అందుకుంది మీనాక్షి చౌదరి. కానీ ఈ చిత్రం కూడా తెలుగులో డిజాస్టర్ గా మిగిలింది. ఇక మీనాక్షికి అవకాశాలు వస్తాయో లేదో అని అందరూ అనుకుంటున్న సమయంలో.. అడివి శేషు హీరోగా వచ్చిన హిట్ సినిమా ఆమెకు మంచి విజయం సాధించిపెట్టింది.

దాంతో మరలా ఈ హీరోయిన్ కి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి.  ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబుతో మీనాక్షికి ఆఫర్ వచ్చింది అని తెలియగానే.. ఇక ఈ హీరోయిన్ దశ మారిపోయింది అనుకున్నారు అందరూ. అందుకు తగ్గట్టుగానే మీనాక్షి నటించిన గుంటూరు కారం సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి మీనాక్షి అభిమానులకు.. నిరాశలు ఎదురు కావడం మొదలయ్యాయి. అందుకు ముఖ్య కారణం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. త్రివిక్రమ్.. అలానే మహేష్ బాబు ఈ చిత్రంలో మీనాక్షికి.. పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర లేదు అని క్లారిటీ ఇవ్వడం.

సినిమా విడుదలయ్యాక.. మీనాక్షి క్యారెక్టర్ చూసి నిజంగా అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీ లీల హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రంలో మీనాక్షికి.. కొంచెం కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇంతకన్నా అవమానమా అంటూ.. ఆమె అభిమానులు బాధ పడసాగారు. అయితే మహేష్ బాబు సినిమాలో అవమానం ఎదురైనా.. ఆ చిత్రం ఫ్లాప్ అయిన కారణంగా.. మీనాక్షి పై ఎటువంటి ప్రభావం పడలేదు. దానికి తోడు ఇప్పుడు ఈ భామకు కాస్త వరస ఆఫర్లు వస్తున్నాయని వినికిడి.

తెలుగులో ఇప్పటికే రెండు భారీ సినిమాల్లో చాన్సులు అందుకున్న మీనాక్షి .. తమిళ ఇండస్ట్రీలో దళపతి విజయ్ తో కూడా జత కడుతోంది. తెలుగులో ఇంకా ఆమెకు స్టార్ క్రేజ్ రాకపోయినా.. గుంటూరు కారం సినిమాతో అందరికీ బాగా నోట్ అయింది ఈ హీరోయిన్. దీంతో ప్రస్తుతం వరస అవకాశాలు అందుకుంటుంది. అంతేకాదు ఇప్పటికే  కోలీవుడ్ లో  స్టార్ స్టేటస్ కూడా అందుకుంది. దీంతో ఇక బిజీ సినిమా తర్వాత .. మీనాక్షి కచ్చితంగా కోలీవుడ్ లో  కూడా వరుస భారీ ఆఫర్లు అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందని. ప్రస్తుతం సినిమాకి రెండు కోట్లు అడుగుతోందని వినికిడి. మొత్తానికి మహేష్ బాబు సినిమాతో అవమానం చవిచూసిన మీనాక్షి చౌదరికి.. ప్రస్తుతం వరస అవకాశాలతో సత్కారం అందిస్తున్నారు సినీ నిర్మాతలు.

Also Read: Graduate MLC: పట్టభద్ర ఓటర్ల వెర్రితనం.. ఐ లవ్యూ.. జై రాకేశన్న.. ఫోన్‌ పే నంబర్‌ అంటూ పిచ్చి రాతలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News