నటనకు గుడ్ బై చెప్పిన ఛార్మి..

చిన్న వయసులోనే సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన ఛార్మి సుమారుగా 50కి పైగా చిత్రాల్లో నటించి పంజాబీ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. నటనకు స్వస్తి చెప్పి ఈ మధ్య కాలంలో నిర్మాతగా కొత్త అవతారమెత్తింది.

Last Updated : May 18, 2020, 05:24 PM IST
నటనకు గుడ్ బై చెప్పిన ఛార్మి..

హైదరాబాద్: చిన్న వయసులోనే సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన ఛార్మి సుమారుగా 50కి పైగా చిత్రాల్లో నటించి పంజాబీ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. నటనకు స్వస్తి చెప్పి ఈ మధ్య కాలంలో నిర్మాతగా కొత్త అవతారమెత్తింది. జ్యోతిలక్ష్మి చిత్రం సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగెట్టిన ఈ అందాల భామ పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై వరుసగా పూరీ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తోంది. అయితే గతేడాది  తెలంగాణ యాసలో వచ్చిన "ఇస్మార్ట్ శంకర్‌" (ismart shankar) చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Also Read: భగ భగ మండిపోతున్న బంగారం ధరలు..

ఇదిలాఉండగా ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఇప్పుడు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై తాను స్క్రీన్‌పై కనిపించనని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఛార్మి స్పందిస్తూ.. ఇండస్ట్రీలో టాలెంట్‌తో చాలామంది హీరోయిన్లు వస్తున్నారని, జ్యోతిలక్ష్మి సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నానని, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలనుకున్నని తెలిపింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న ఫైటర్ చిత్రం‌ తరువాత రెండు భారీ చిత్రాలను నిర్మించబోతున్నట్లు ఛార్మి తెలిపింది. మరోవైపు వెబ్‌ సిరీస్‌లు నిర్మించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు పేర్కొంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News