India Covid-19: క్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీల సంఖ్య

భారత్‌ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది.

Last Updated : Nov 1, 2020, 10:19 AM IST
India Covid-19: క్రమంగా పెరుగుతున్న కరోనా రికవరీల సంఖ్య

Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌ ( India ) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల క్రితం నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రికవరీ రేటు నిత్యం గణనీయంగానే పెరుగుతూనే ఉంది. ఇదిలాఉంటే.. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 91.54 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.49 శాతం, యాక్టివ్ కేసుల రేటు 6.97 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. 

గత 24 గంటల్లో శనివారం ( అక్టోబరు 31న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 46,964 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 470 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,84,083 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,22,111 కి చేరింది. Also read: Doraikkannu: కరోనాతో తమిళనాడు వ్యవసాయ మంత్రి కన్నుమూత

అయితే నిన్న కరోనాతో 58,684 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 74,91,513 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,70,458 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 10,91,239 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి అక్టోబరు 31 వరకు మొత్తం 10,98,87,303 (Covid-19 total tests) నమూనాలను దేశంలో పరీక్షించారు.  

Trending News