AP Liquor: వైన్‌షాప్‌ల వద్ద మందుబాబులకు షాక్‌..  ధరలు చూస్తే కిక్కు దిగిపోద్ది

Big Shocked After Visits Wine Shops In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో తీసుకొచ్చిన మద్యం విధానంతో మందుబాబు ఫుల్‌ ఖుషీలో ఉండగా వారికి ఊహించని షాక్‌ తగిలింది. రూ.99కే మద్యం అని చెప్పగా.. వైన్స్‌కు వెళ్తే మాత్రం ధరలు షాకిచ్చాయి. అధిక ధరలకే మద్యం అమ్ముడైంది.

1 /8

కొత్త బ్రాండ్లు రూ.99కే లభిస్తుందని ఎంతో ఆశతో మందుబాబులకు వైన్స్ వద్ద భంగపాటు ఎదురైంది.

2 /8

ఆంధ్రప్రదేశ్‌ తీసుకొచ్చిన కొత్త మద్యం విధానంతో ధరలు భారీగా తగ్గుతాయని ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబు రూ.99కే క్వార్టర్‌ మందు అని ప్రకటించారు.

3 /8

రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు తెరచుకోవడంతో ఎంతో ఉత్సాహంతో మందుబాబులు వైన్స్‌కు ఎగబడ్డారు.

4 /8

తక్కువ ధరకే మద్యం దొరుకుతుందని భావించి వైన్‌షాపులకు వెళ్లిన మందుబాబులకు తీవ్ర నిరాశ ఎదురైంది. 

5 /8

ఎక్కడ కూడా రూ.99కే క్వార్టర్ బాటిల్ మందు లభించలేదు. దీంతో మందుబాబులు తీవ్ర నిరాశ చెందారు.

6 /8

మద్యం వ్యాపారులను నిలదీయడంతో ఇంకా ఆ బ్రాండ్లు రాలేదని సమాధానం ఇచ్చారు.

7 /8

ఇక గత్యంతరం లేక మందుబాబులు రూ.120, రూ.150, రూ.180 చెల్లించి క్వార్టర్ బాటిళ్లు తీసుకెళ్తున్నారు.

8 /8

గతంలో కంటే మద్యం ధరల్లో పెద్దగా మార్పు రాలేదని మందుబాబులు చెబుతున్న మాట. ధర తక్కువ లేకున్నా తమకు ఇష్టమైన బ్రాండ్లు దొరుకుతున్నాయని మందుబాబులు సంతోషిస్తున్నారు.