Gold Rates Today: బడ్జెట్ కు ముందు రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం.. తులం రూ. 85వేలు


Gold Rates Today: బంగారం ధర భగ్గమంటోంది.రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న పసిడి శనివారం మరో ఉన్నత శిఖరాలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 
 

1 /6

Gold Rates Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. శనివారం మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ భారీగా ఉండటంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లి బులియన్ మార్కెట్లో శుక్రవారం ఒకేరోజు 99.9శాతం స్వచ్చత కలిగిన బంగారం ధరలు రూ. 1,100 పెరిగి చారిత్రక గరిష్ట స్థాయి రూ. 85వేలకు చేరింది. 

2 /6

బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ. 84,900గా నమోదు అయ్యింది. ధరలు ఈ స్థాయికి చేరుకోవడం కూడా ఇదే మొదటి సారి అని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. జనవరి నెలలో బంగారం ధర రూ. 5,510 లేదా 7శాతం ఎగబాకింది. జనవరి 1వ తేదీ బంగారం ధర రూ. 79, 390 ఉంది. 

3 /6

 99.5శాతం స్వచ్చత కలిగిన 10గ్రాముల బంగారం ధర రూ. 1,100 అధికంగా పెరిగి రూ. 84,500పలుకుతోంది. ఇటు హైదరాబాద్ లోనూ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,310 పెరిగి రూ. 84,330 పలుకుతోంది. అంతకుముందు ఇది రూ. 83వేలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల విలువ రూ. 1,200 ఎగబాకి రూ. 77,300కు చేరుకుంది.   

4 /6

బంగారంతోపాటు వెండి కూడా పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధర రూ. 95వేలు పలికింది. కిలో ధర రూ. 850 పెరిగింది. అంతకుముందు రూ. 94,150గా ఉంది. ఇటు హైదరాబాద్ కిలో వెండి రూ. 1000 పెరిగి..రూ. 1.07లక్షలకు చేరుకుంది.

5 /6

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2,800 డాలర్లు అధిగమించడం వల్ల దేశీయంగా తొలిసారిగా 84వేల మార్క్ ను అధిగమించిందని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీ సీనియర్ ఉన్నతాధికారి సౌమిల్ గాంధీ తెలిపారు. ప్యూచర్ ట్రేడ్ మార్కెట్లో ఫిబ్రవరి నెలకుగాను రూ. 487 పెరిగి రూ. 82,210 పలుకుతోందని తెలిపారు. 

6 /6

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్లో అతి విలువలైన లోహాలపై సుంకాలు తగ్గిస్తే ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. మెక్సికో, కెనడాలపై అమెరికా సుంకాలను విధించడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లిస్తుండటం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తుండటం కూడా మరో ప్రధాన కారణమని చెప్పవచ్చు.