Kotak Mahindra Bank: దేశీయ దిగ్గజ బ్యాంకుల్లో ఒక్కటైన కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఊరట లభించింది. గత ఏడాది విధించిన ఆంక్షలను తొలగిస్తూ ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయడం మరింత సులభం కానుంది. ఆ వివరాలను తెలుసుకుందాం.
Kotak Mahindra Bank: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కోటక్ మహీంద్రా బ్యాంక్పై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. ఏప్రిల్ 2024లో, RBI, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 35A కింద తన అధికారాలను వినియోగించుకుని, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్పై కొన్ని వ్యాపార పరిమితులను విధించింది. ఆన్లైన్,మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను జోడించడం..కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయడాన్ని నిలిపివేయాలని బ్యాంకును ఆదేశించింది.
ఏప్రిల్ 2024లో, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ రిస్క్ మేనేజ్మెంట్, సమాచార భద్రతా కార్యకలాపాలలో తీవ్రమైన లోపాలు కనుగొనబడిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు RBI తెలిపింది. 2022, 2023 సంవత్సరాలకు బ్యాంకు ఐటీ దర్యాప్తు ద్వారా తలెత్తిన ఆందోళనలు.. ఈ ఆందోళనలను సకాలంలో సముచిత పద్ధతిలో పరిష్కరించడంలో బ్యాంక్ నిరంతరం విఫలమవడంతో ఈ చర్య అవసరమైంది.
బ్యాంకు తన ఆన్లైన్ , మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్లను జోడించడం కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
డిసెంబర్ 2020లో, పదే పదే టెక్నాలజీ సంబంధిత లోపాల కారణంగా HDFC బ్యాంక్ కొత్త కార్డులను జారీ చేయకుండా కొత్త డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించకుండా RBI నిషేధించింది. అయితే, ఈ నిషేధాన్ని మార్చి 2022లో ఎత్తివేశారు.
డిసెంబర్ త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం 10.22 శాతం పెరిగి రూ.4,701 కోట్లకు చేరుకుంది. బ్యాంకు మూలధన మార్కెట్ సంబంధిత యూనిట్ల మంచి పనితీరు కారణంగా బ్యాంకు లాభాలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.4,265 కోట్లుగా ఉండగా, జూలై-సెప్టెంబర్, 2024 త్రైమాసికంలో రూ.5,044 కోట్లుగా ఉంది.
సమీక్షా త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.16,050 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.14,096 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ వ్యయం రూ.10,869 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.9,530 కోట్లుగా ఉంది.