New India Co-op Bank: కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బిఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు బ్యాంకు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకు దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి.
Gold: భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేసే సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తోంది. ప్రజలు బంగారం కొని ఇంట్లో దాచుకుంటారు. అయితే ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో తెలుసా. పరిమితికి మంచి బంగారం ఉంచితే ఏమౌతుందో తెలుసా. బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Kotak Mahindra Bank: దేశీయ దిగ్గజ బ్యాంకుల్లో ఒక్కటైన కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఊరట లభించింది. గత ఏడాది విధించిన ఆంక్షలను తొలగిస్తూ ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయడం మరింత సులభం కానుంది. ఆ వివరాలను తెలుసుకుందాం.
Gold Rate Today:ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు గురువారం వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. దేశ రాజధానిలో బంగారం ధర 10 గ్రాములకు రూ.340 తగ్గి రూ.87,960కి చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం బుధవారం 10 గ్రాములకు రూ.88,300 వద్ద ముగిసింది.
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా గత 5 సెషన్లో మార్కెట్ భారీగా నష్టపోయింది. మంగళవారం ఇంట్రా డే సెషన్ లో సెన్సెక్స్ 1200పాయింట్లు నష్టపోయింది. 77,000కంటే తక్కువ స్థాయికి చేరింది. నిఫ్టీ 50 కీలకమైన 23,000కన్నా దిగువకు చేరుకుంది.
Vijay Mallya: విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కంటే ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకొన్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ. 6,200కోట్లు బాకీ ఉన్నానని..తన నుంచి రూ. 10,200కోట్లు బ్యాంకులు రాబట్టుకొన్నాయని తెలిపారు. విజయ్ మాల్యా నుంచి రూ.14 వేల కోట్లు రికవరీ చేసినట్లు పార్లమెంటులో కూడా సమాచారం అందించినట్లు విజయ్ మాల్యా న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు బ్యాంకుల నుండి ఈ సమాధానం కోరింది.
Avoid using Chat Deepseek: అధికారిక ప్రయోజనాల కోసం ChatGPT, DeepSeek లను ఉపయోగించడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిషేధించింది.అధికారిక ప్రయోజనాల కోసం ChatGPT, DeepSeek వంటి AI సాధనాలను ఉపయోగించకుండా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులను కోరింది.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాల్లోనే ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మన మార్కెట్లు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఇవాళ సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల వరకు కోల్పోయింది. దలాల్ స్ట్రీట్ పై ప్రభావం చూపిన అంశాలను ఓసారి తెలుసుకుందాం.
Budget 2025: 2025లో సమర్పించిన బడ్జెట్ ఇప్పటి వరకు అతిపెద్ద బడ్జెట్ గా నిలుస్తుంది. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె గ్రూపు దాదాపు రూ. 50లక్షల కోట్ల బడ్జెట్ ను సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ కేంద్ర బడ్జెట్ను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Budget Day Stock Market: సాధారణంగా భారత స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వారంలో 5 రోజులు మాత్రమే ట్రెడింగ్ సాగిస్తుంటాయి. వీటితోపాటు పబ్లిక్ హాలిడేస్ , ప్రత్యేక సందర్భాల్లో కూడా సెన్సెక్స్, నిఫ్టీ మూసివేసి ఉంటాయి. మరి ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆ రోజు శనివారం కావడంతో బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Maha Kumbh 2025: ఇండిగో ప్రయాగ్రాజ్ మార్గంలో విమాన టిక్కెట్ ధరలను 30 నుండి 50 శాతం తగ్గించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి టిక్కెట్ ధరలను హేతుబద్ధీకరించాలని విమానయాన సంస్థలను కోరాలని DGCAని కోరారు.
Gold Rate Today: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. కొత్త సంవత్సరం తొలి నెలలోనే భారీగా పెరిగింది. ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. క్రితం ట్రేడింగ్ రోజున కిలో వెండి ధర రూ.92,000 నుంచి రూ.1,000 పెరిగి రూ.93,000కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా, కమోడిటీ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ఔన్సుకు $2,794.70 వద్ద స్థిరంగా ఉన్నాయి.
Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత త్రైమాసికం డిసెంబర్ 31 తో ముగిసిన నేపథ్యంలో జనవరి , మార్చి త్రైమాసికానికి గాను ఈ పథకాల వడ్డీరేట్లు ప్రకటించింది. దీనిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ వంటివి ఉన్నాయి. చివరిసారిగా 2023 లో డిసెంబర్లో జనవరి -మార్చి గాను ఈ రెండు పథకాల వడ్డీ రేటును పెంచింది కేంద్ర ప్రభుత్వం.
Big rule changes from January 1, 2025: 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పి..2025 కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. ఇంకో మూడ్నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి చాలా నిబంధనలు మారబోతున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, వీసా నిబంధనలు, ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్ మాత్రమేకాదు ఫించన్లు, కార్ల ధరలలో కూడా మార్పులు రాబోతున్నాయ్. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలతో పోల్చితే డిసెంబర్ నెలలో భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం పై భారీగా తగ్గుదల నమోదు అయ్యింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఏమేరకు తగ్గిందో తెలుసుకుందాం.
Pan Card: పాన్ కార్డు వినియోగదారులకు కీలక అలర్జ్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొందరు పార్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ కీలక అప్ డేట్ ఏంటో చూద్దాం.
Public Provident Fund Scheme: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారి కోసం కేంద్రం ఎన్నో స్కీములను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ జాబితాలో ఓ సూపర్ స్కీం కూడా ఉంది. తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్ంలో డబ్బులు పొందే ఆ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.