Ludhiana Man Train Stunt Video Viral: కొంత మంది యువకుల చేష్టలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. రిస్కీ స్టంట్లు చేస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కదులుతున్న రైళ్లలో విన్యాసాలు చేసి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral Video) అవుతుంది. ఆ వ్యక్తి మాల్వా ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ మరణించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన పంజాబ్ లూథియానా జిల్లా ఖన్నాలోని చావా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే...
వీడియో ఓపెన్ చేస్తే... ఓ వ్యక్తి ట్రైన్ లో మెట్ల దగ్గర వేలాడుతూ కనిపిస్తాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత అతడి తల స్తంభానికి తగలడంతో కింద పడిపోయి మరణిస్తాడు. ఈ ఘటన అక్టోబరు 6న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే మెుదట మెట్ల దగ్గర కూర్చుని పడిపోయినట్లు పోలీసులు భావించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook