England vs India : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ మనదే.. రెండో టీ20లో టీమిండియా సునాయాస విజయం..

England vs India 2nd T20 : ఇంగ్లాండ్-టీమిండియా జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. బ్యాట్‌తో జడేజా, బంతితో భువీ రాణించడంతో టీమిండియా సునాయాసంగా గెలుపొందింది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 10, 2022, 07:14 AM IST
  • ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో టీమిండియా విజయం
  • 49 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిన టీమిండియా
  • టీ20 సిరీస్ టీమిండియా కైవసం
England vs India : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ మనదే.. రెండో టీ20లో టీమిండియా సునాయాస విజయం..

England vs India 2nd T20: ఇంగ్లాండ్‌తో రెండో టీ20లోనూ భారత్ ఘనవిజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాట్‌తో జడేజా, బంతితో భువీ రాణించడంతో టీమిండియా సునాయాసంగా గెలుపొందింది. టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు కేవలం 121 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రవీంద్ర జడేజా 5 ఫోర్లతో 46(29) పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 2 సిక్సులు,  3 ఫోర్లతో 31 పరుగులు, రిషబ్ పంత్ 26 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. జడేజా ఆదుకోకపోయి ఉంటే టీమిండియా భారీ స్కోర్ సాధించకపోయి ఉండేది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లు, రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లు పడగొట్టారు.

టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టును పేసర్ భువనేశ్వర్ ఆదిలోనే చావుదెబ్బ కొట్టాడు. ఇద్దరు ఓపెనర్లు జాసన్ రాయ్ (0), జోస్ బట్లర్ (4)ను వెంట వెంటనే పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ ఇక పోటీ కనబర్చలేదు. మొయిన్ అలీ (35), డేవిడ్ విల్లే (33) మినహా మిగతా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. దీంతో ఆ జట్టు కేవలం 17 ఓవర్లలో కేవలం 121 పరుగులకే కుప్పకూలింది.

టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జస్‌ప్రిత్ బుమ్రా 2 వికెట్లు, చాహల్ 2 వికెట్లు, పాండ్యా, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. భువీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం. 

Also Read: Telugu States Rains Live Updates: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీఎం విజ్ఞప్తి

Also Read: Horoscope Today July 10th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి దగ్గరి బంధువు నుంచి శుభవార్త అందే ఛాన్స్..

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News