తెలుగు కుర్రోడికి వెస్టిండీస్‌ టూర్‌ టెస్ట్ జట్టులో చోటు

వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత టెస్టు జట్టులో కాకినాడకు చెందిన తెలుగు కుర్రాడు హనుమ విహారికి చోటు దక్కింది.

Last Updated : Jul 21, 2019, 09:25 PM IST
తెలుగు కుర్రోడికి వెస్టిండీస్‌ టూర్‌ టెస్ట్ జట్టులో చోటు

ముంబై: వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత టెస్టు జట్టులో కాకినాడకు చెందిన తెలుగు కుర్రాడు హనుమ విహారికి చోటు దక్కింది. ప్రస్తుతం ఆంధ్రా రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమ విహారికి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కడం ఇదేం మొదటిసారి కాదు. 2018-19 సీజన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లోనూ జట్టులో చోటు దక్కించుకున్న విహారి.. సిడ్నీలో ఆడిన మ్యాచ్‌లో 42 పరుగులు చేసి సెలెక్టర్లను మెప్పించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లోనూ జట్టుకు ఎంపికయ్యాడు. 

హనుమ విహారి ఇప్పటివరకు రికార్డు స్థాయి ఇన్నింగ్స్‌ ఆడకపోయినప్పటికీ.. సెలెక్టర్ల విశ్వాసాన్ని చూరగొనడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ఆఫ్ స్పిన్నర్ కూడా అయిన విహారి ఎంపికతో జట్టు బ్యాలెన్సింగ్‌గా ఉంటుందని సెలెక్టర్లు భావిస్తున్నారు. 2012లో ఆస్ట్రేలియాలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లోనూ విహారి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Trending News