పార్టీ పేరును ప్రకటించిన కోదండరామ్

ప్రొఫెసర్ కోదండరామ్ కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు.

Last Updated : Apr 2, 2018, 04:38 PM IST
పార్టీ పేరును ప్రకటించిన కోదండరామ్

ప్రొఫెసర్ కోదండరామ్ కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ పేరు 'తెలంగాణ జన సమితి’ అని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చాలా ఆలోచించే పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రావడంపై రాజనీతిజ్ఞులతో మాట్లాడామన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం ఉద్యమం సాగిందన్నారు. 29న హైదరాబాద్‌లో తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభను ఏర్పాటు చేయనున్నట్లు విలేకర్లతో అన్నారు. ఈ నెల 4న జెండాను ఆవిష్కరిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోయిందని అన్నారు.

ఉద్యోగాల భర్తీ అలాగే మిగిలిపోయిందని, ప్రజాస్వామిక విలువలకు కూడా గౌరవం లేకుండా పోయిందన్నారు. అన్ని నిర్ణయాలు సచివాలయం నుంచే జరుగుతున్నాయని పేర్కొన్నారు.  మంత్రులకు సంబంధం లేకుండా సీఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం బలిదానాలు జరిగాయన్నారు. రాజకీయాల పట్ల ద్వేషం లేదని, రాజకీయాలు సమాజానికి గుండెలాంటివని, ఇది వ్యాపారం కారాదని కోదండరామ్  అన్నారు.

 

Trending News