ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు ఈసీ సరికొత్త ప్రయోగం

                 

Last Updated : Nov 6, 2018, 09:12 PM IST
ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు ఈసీ సరికొత్త ప్రయోగం

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో జిల్లాల వారీగా బ్రాండ్ అంబాసిడర్లను ఎంపిక చేసింది.ఈసీ ఎంపిక చేసిన బ్రాండ్ అంబాసిడర్లలో పలువురు క్రీడా, సినీరంగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికైన ప్రముఖుల జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం...

* హీరో విజయ్ దేవరకొండ
* టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా
*  బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
* మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, 
* ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న 

దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ దివ్యాంగులు కూడా ఓటింగ్ లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని..అలాంటి  వారి  కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తామన్నారు. వీల్ చైర్స్ తో పాటు ఆటోల సాయంతో పోలింగ్ కేంద్రాలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని అన్నారు. దివ్యాంగుల కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు

Trending News