AP: కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన వైఎస్ జగన్..రాష్ట్ర అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 

Last Updated : Jan 20, 2021, 12:11 AM IST
AP:  కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన వైఎస్ జగన్..రాష్ట్ర అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) హఠాత్తుగా ఢిల్లీ పర్యటన ( Delhi Tour ) చేపట్టారు. ఈ పర్యటనపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. అయితే ఈ పర్యటన కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేపట్టినట్టు స్పష్టమైంది. రాత్రి పదిగంటలకు వైఎస్ జగన్.. అమిత్ షా ( Amit Shah ) తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) అంశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పలు అంశాలను సీఎం జగన్..‌ అమిత్‌ షా దృష్టికి తీసుకువచ్చారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఉ‍న్నారు. 

మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna reddy ) స్పష్టం చేశారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిళ్లీ వెళ్లినట్టు తెలిపారు. ప్రతిపక్షాల రాద్ధాంతాన్ని కొట్టిపారేశారు. మూడు రాజధానుల అంశంపై కూడా వైఎస్ జగన్..అమిత్ షాతో చర్చించినట్టు సమాచారం. 

Also read: AP: జగన్ ఢిల్లీ పర్యటన వెనుక కారణాలివే..రాత్రి పది గంటలకు అమిత్ షాతో భేటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News