ప్రధాని మోదీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన కేశినేని నాని

Last Updated : Jul 21, 2018, 06:43 PM IST
ప్రధాని మోదీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే ఉత్తమ నటుడు అని వ్యాఖ్యానించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. శుక్రవారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన కేశినేని నాని.. తీర్మానం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గంటన్నరసేపు చేసిన ఉపన్యాసం అంతా ఓ పెద్ద డ్రామాగా కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. మోదీ మాటలను ఓ గొప్ప బాలీవుడ్ బ్లాక్ బస్టర్‌గా, గొప్ప యాక్షన్ డ్రామాగా అభివర్ణించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీ కేశినేని నాని 30 నిమిషాల సమయం కేటాయించాల్సిందిగా కోరగా స్పీకర్ సుమిత్రా మహజన్ మాత్రం ఆయనకు కేవలం 5 నిమిషాలు మాత్రమే కేటాయించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తంచేస్తూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తనకే మాట్లాడేందుకు తగిన అవకాశం ఇవ్వకపోవడం ఏంటంటూ ఎంపీ కేశినేని నాని కేంద్రంపై తీవ్ర అసహనానికి గురయ్యారు. 

Trending News