10 గంటలపాటు శ్రీవారి దర్శనం నిలిపివేత

శ్రీవారి ఆలయంలో దర్శనాన్ని నిలిపివేస్తున్నారు.

Last Updated : Jan 29, 2018, 07:45 PM IST
10 గంటలపాటు శ్రీవారి దర్శనం నిలిపివేత

శ్రీవారి ఆలయంలో దర్శనాన్ని నిలిపివేస్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా జనవరి 31న ఉదయం 11 గంటలకు శ్రీవారి గుడి తలుపులు మూసేస్తారు. మరళా రాత్రి 9:30 గంటలకు తెరుస్తారు. ఈ 10 గంటల సమయంలో శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు టిటిడీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. 

టిటిడీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ.. జనవరి31న సాయంత్రం 5:18 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 8:41 గంటలకు గ్రహణం వెళ్ళిపోతుంది. గ్రహణ సమయంలో ఆరు గంటలు ముందుగా తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నదని చెప్పారు. రాత్రి 9:30 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి శుద్ధి, పుణ్య హవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారని చెప్పారు.

Trending News