Shocking Incident: పెళ్లయి గదిలోకి వెళ్లగానే ఏం జరిగింది? నవదంపతులు మృత్యుఒడిలోకి

Newlyweds Couple Died After Marriage Within Hours Gap: పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు పెళ్లి కొడుకు కిరాతకుడు అయ్యాడు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే వధువును దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 9, 2024, 06:19 PM IST
Shocking Incident: పెళ్లయి గదిలోకి వెళ్లగానే ఏం జరిగింది? నవదంపతులు మృత్యుఒడిలోకి

Tragic Incident: కొన్నేళ్లుగా ప్రేమించుకోవడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకారం తెలిపారు. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లయి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే వధువు దారుణ హత్యకు గురయ్యింది. కొన్ని గంటల కిందట తాళి కట్టిన వరుడే ఆమెను హతమార్చాడు. ఈ ఘోర సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బంధువులు ఇళ్లకు చేరుకునేలోపు ఈ దారుణం వెలుగుచూడడం కలకలం రేపింది. అయితే వరుడు ఎందుకు హత్య చేశాడనేది మాత్రం తెలియరాలేదు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Korba Express Fire: ఘోర రైలు ప్రమాదం.. తిరుమల వెళ్లాల్సిన రైలు అగ్నికి ఆహుతి

 

కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్సలోని చంబరసనహళ్లి గ్రామానికి చెందిన నవీన్‌ (26), లిఖిత (19) ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించారు. తమ ప్రేమకు పెద్దలు అడ్డంకులు సృష్టించకుండా పెళ్లికి అంగీకరించడంతో వారిద్దరూ చాలా సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే ఆగస్టు 7వ తేదీ బుధవారం రోజు ఓ కల్యాణ మండపంలో నవీన్‌ తాను ప్రేమించిన లిఖిత మెడలో మూడు ముళ్లు వేశాడు. బంధుమిత్రులు హాజరై ఆ దంపతులను ఆశీర్వదించారు. ఆనందోత్సాహాల మధ్య జరిగిన పెళ్లి అనంతరం వధూవరులు ఇంటికి వెళ్లారు.

Also Read: Cloths Issue Attack: ఆరేసిన బట్టలపై మహిళల మధ్య కొట్లాట.. మటన్ కత్తితో తెగిన ఒకరి పీక

గ్రామానికి చేరుకున్న అనంతరం తన భార్య లిఖిత, అత్తామామలను నవీన్‌ బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బంధువుల ఇంట్లోని ఓ గదిలోకి లిఖిత, నవీన్‌ ఇద్దరూ వెళ్లారు. విశ్రాంతి తీసుకుంటుండడంతో కుటుంబసభ్యులు ఇంటి బయట కూర్చున్నారు. కొద్దిసేపటికే లోపలి గదిలో నుంచి గట్టిగా కేకలు వినిపించారు. ఏం జరిగిందోనని భయాందోళనతో లోపలికి వెళ్లి చూడగా నవ వధువు లిఖిత రక్తపు మడుగులో ఉండిపోయింది. నవీన్‌ కూడా తీవ్ర గాయాలపాలై పడి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా లిఖిత అప్పటికే మృతి చెందింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవీన్‌ గురువారం పరిస్థితి విషమించి చనిపోయాడు.

పెళ్లయిన కొన్ని గంటలకే వధూవరులు ఇద్దరూ చనిపోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ గదిలో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. విశ్రాంతి కోసం వెళ్లిన వారిద్దరూ తీవ్ర రక్తస్రావంలో ఎలా ఉన్నారు? అనే ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. అయితే వరుడు నవీన్‌ లిఖితను హత్య చేశాడని ప్రాథమికంగా తేలింది. గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికి ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైందని.. అది కాస్త తీవ్రమవడంతో అక్కడే ఉన్న కత్తితో లిఖితను హతమార్చాడని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న నవీన్‌ ఎందుకు ఇలా చేశాడని ప్రశ్నలు వస్తున్నాయి. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News