Operation Valentine Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'(Operation Valentine)’. శక్తిప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ స్ట్రైక్ (First Strike) పేరుతో టీజర్ విడుదల చేశారు మేకర్స్. ''మన ఎయిర్ ఫోర్స్ని ఇంకొక దేశంలోకి పంపించడమంటే.. ఇట్స్ ఏ డిక్లరేషన్ ఆఫ్ వార్’. ‘ఇలా ప్రతికారం తీర్చుకుంటూ పోతే.. దేశాలు ఉండవు.. బార్డర్స్ మాత్రమే ఉంటాయి'' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ''శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ది కూడా..'' అని వరుణ్ చెప్పిన డైలాగ్ టీజర్కే హైలెట్గా నిలిచింది.
పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్లను నాశనం చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టే మిషనే.. ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర కథా నేపథ్యంగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీనిని తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం ద్వారా వరుణ్ బాలీవుడ్ లోకి.. మానుషి చిల్లర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి