నేడు సాయంత్రం అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి అంత్యక్రియలు

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజ్‌పేయి

Last Updated : Aug 17, 2018, 02:09 PM IST
నేడు సాయంత్రం అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి అంత్యక్రియలు

నేడు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా వాజ్‌పేయి నివాసానికి తరలించారు. రేపు శుక్రవారం ఉదయం 9 గంటలకు వాజ్‌పేయి భౌతికకాయాన్ని పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు వాజ్ పేయి పార్థివదేహానికి నివాళి అర్పించి ఆయన్ను కడసారి చూసుకునేందుకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు బీజేపీ కార్యాలయం నుంచి వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. రేపు సాయంత్రం 4 గంటలకు స్మృతి స్థల్‌లో వాజ్‌పేయి పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు బీజేపీ అధినాయకత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

 

 

Trending News