Snake bite: భారత్ లో ఏటా 40 లక్షల దాక పాము కాట్లు.. లోక్ సభలో సంచలన విషయాలు వెల్లడించిన ఎంపీ..

Bjp mp Rajiv Pratap rudy: దేశంలో పాము కాటు ఘటనలు ఎక్కువయ్యాయని ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ ఆందోళన వ్యక్తం చేశారు.  అంతేకాకుండా.. ప్రతి ఏడాది యాభైవేల మంది వరకు కూడా పాముకాటుకు గురౌతున్నట్లు తెలుస్తోంది.

1 /6

వర్షాకాలంలో పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. అడవులు, చెట్లు ఉన్న చోట ఇళ్లలో  పాములు ఎక్కువగా వస్తుంటాయి. ఇదిలా ఉండగా.. పొలాలు, ఇళ్లలోనికి  కూడా పాములు బైటకు వస్తుంటాయి. ఎలుకల వేటలో ఇవి ఇళ్లలోకి వస్తుంటాయి.

2 /6

పొలం పనులకు వెళ్లిన వారు ఎక్కువగా పాముకాటుకు గురౌతుంటారు. ఇలాంటి నేపథ్యంలో.. కొందరు పాముకాటుకు గురైనప్పుడు దగ్గరలోని ఆస్పత్రికి వెళ్తుంటారు. సమయానికి యాంటీవీనమ్ తీసుకొని పాము కాటు నుంచి బైటపడుతారు.   

3 /6

కానీ మరికొందరు మాత్రం.. పాము కాటుకుబలౌతుంటారు. ఈ నేపథ్యంలో పాముల కాట్ల ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఈ నేపథ్యంలో.. లోక్ సభలో బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది యాభై వేల మంది వరకు కూడా పాము కాటుకు గురౌతున్నట్లు చెప్పారు.   

4 /6

ప్రపంచ వ్యాప్తంగా పాము కాటు మరణాల్లో అత్యధికంగా భారత్ లోనే చోటుచేసుకుంటున్నాయని ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది మనదేశంలో.. 30 నుంచి 40  లక్షల మంది..పాముకాటుకు గురౌతున్నారు. వీరిలో యాభైవేల మంది చనిపోతున్నట్లు తెలుస్తోంది.

5 /6

అదే విధంగా బీహర్ లో.. పేదరికంతోపాటు, నేచర్ వైపరీత్యాలు సైతం సంభవిస్తున్నాయని ఎంపీ అన్నారు. వాతావరణ మార్పులపై కూడా ఎంపీ లోక్  సభలో చర్చించారు. దీంతో దేశంలో ఒక్కసారిగా పాముకాటు ఘటన వార్తలలో నిలిచింది.

6 /6

వర్షాకాలంలో పొలంపనులకు వెళ్లే వారు.. అడవులదగ్గర ఇళ్లు ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని కూడా నిపుణులు చెబుతున్నారు. పాములు కన్పిస్తే ,వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.