PM Kisan Yojana: పీఎం కిసాన్‌ యోజనలో రూ.2000 పొందేందుకు మీరు అర్హులా? ఎలిజిబిలిటీ చెక్‌ చేయండి..

Pm Kisan Yojana Eligibility Check: ఏవైనా ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించాలంటే తగిన ధృవపత్రాలను అందించాలి. లేకపోతే మీరు ఎలాంటి పథకాలకు అర్హత సాధించలేరు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి 19వ విడుత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారా? ఇలా చెక్‌ చేసుకోండి.
 

1 /5

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన (PMKSY) 2019లో ప్రారంభించారు. దీని ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ.6000 మూడు విడుతల్లో మంజూరు చేస్తున్నారు.  

2 /5

ఇప్పటి వరకు 18వ విడుత నిధులు మంజూరు అయ్యాయి. 19వ విడుత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆ నిధులు ఫిబ్రవరి 24వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌ భాగల్పూర్‌ పర్యాటనలో విడుదల చేస్తారని చెప్పారు.  

3 /5

అయితే, వ్యవసాయశాఖ మంత్రి అయిన శివరాజ్‌ సింగ్‌ ఈ తేదీని ప్రకటించారు కానీ, దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు కేంద్ర ప్రభుత్వం. కేవలం 18వ విడుత నిధుల మంజూరు తేదీ మాత్రమే ఉంది ఈ నిధులు 2024 అక్టోబర్‌ 5వ తేదీ విడుదల చేశారు.  

4 /5

మీరు కూడా పీఎం కిసాన్ నిధులు పొందడానికి అర్హులు అవుతారా? తద్వారా ఈ పథకం నుంచి వచ్చే డబ్బులు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) ద్వారా మీ ఖాతాలో జమా అవుతాయి.   

5 /5

19వ విడుత పీఎం కిసాన్‌ నిధులకు అర్హత సాధించాలంటే ముందుగానే ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. ల్యాండ్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకోవాలి. ఇది కాకుండా మీ అకౌంట్‌కు ఆధార్‌ కార్డు లింక్‌ అయి ఉండాలి.