భారత్ vs ఆస్ట్రేలియా 3వ వన్డే: ఆసిస్‌కి చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్

భారత్ vs ఆస్ట్రేలియా 3వ వన్డే: ఆసిస్‌కి చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్

Last Updated : Mar 8, 2019, 05:18 PM IST
భారత్ vs ఆస్ట్రేలియా 3వ వన్డే: ఆసిస్‌కి చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్

రాంచి: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రాంచిలోని జేఎస్‌సిఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో జరుగుతున్న 3వ వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ మొదట ఫీల్డింగ్‌కే మొగ్గుచూపాడు. దీంతో ఆసిస్ ఆటగాళ్లు బ్యాటింగ్ ప్రారంభించారు. పుల్వామా దాడిలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళిగా నేటి మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఇండియన్ ఆర్మీ టోపీలు ధరించి మైదానంలోకి దిగారు. 

ఇప్పటికే హైదరాబాద్, నాగపూర్‌లలో జరిగిన రెండు వన్డేలలో విజయం సొంతం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే, 3-0 తేడాతో సిరీస్‌లో పైచేయి సాధించినట్టే అవుతుంది. అదే కానీ జరిగితే సిరీస్ ఇక టీమిండియా వశమైనట్టే భావించవచ్చు.

Trending News