AP CoronaVirus Cases: ఏపీలో 2 వేలకు చేరువలో డిశ్ఛార్జ్ కేసులు

తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 59కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు.

Last Updated : May 28, 2020, 01:12 PM IST
AP CoronaVirus Cases: ఏపీలో 2 వేలకు చేరువలో డిశ్ఛార్జ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరింతగా ప్రభావం చూపిస్తోంది. ఏపీలో తాజాగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,841కి చేరుకుంది. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 59కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు.  తండ్రి ఎన్టీఆర్‌కు Balakrishna ఘన నివాళి

Image Credit: twitter/@ArogyaAndhra

ఏపీలో ఇప్పటివరకూ 1958 మంది చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 824 యాక్టీవ్ కేసులున్నాయి. వీరు రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 9,858 శాంపిల్స్ సేకరించి పరీక్షించగా 54 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News