తిరుపతిలో "దేవాంశుడి" సందడి..!

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 

Last Updated : Jan 14, 2018, 01:35 PM IST
తిరుపతిలో "దేవాంశుడి" సందడి..!

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సీఎం సతీమణి భువనేశ్వరితో పాటు కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ కలియుగదైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో లోకేష్ కుమారుడు మరియు చంద్రబాబు మనవడు దేవాంశ్ దేవాలయంలో చేసిన సందడి పలువురిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తన తాత చంద్రబాబు ఒడిలో కూర్చుని దేవుడిని ప్రార్థిస్తున్న సన్నివేశం చాలా ముద్దుగొలిపేలా ఉంది. ఆ ఫోటోలను లోకేష్ తన సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్‌లో పంచుకున్నారు. సంక్రాంతి వేడుకలు నిర్వహించేందుకు చంద్రబాబు, బాలకృష్ణ దంపతులు శనివారమే నారావారిపల్లెకు వెళ్లారు. ఆ తర్వాత ఆదివారం ఉదయమే జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరుపతికి వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 

Trending News