Andhra Pradesh: మోహన్‌బాబు, మా అధ్యక్షుడు విష్ణు పేరిట సాగుభూమి పట్టాలు.. వారు నిరుపేదలా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు

AP News: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నిరుపేదలా?. ఈ విషయంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 11:24 AM IST
  • నిరుపేదలకు ఇచ్చే భూమి కేటాయింపు
  • మోహన్‌బాబుకు 2.79 ఎకరాలు, విష్ణుకు 1.40 ఎకరాలు
  • 2015లో పట్టాలు మంజూరు, తాజాగా వెలుగులోకి
Andhra Pradesh: మోహన్‌బాబు, మా అధ్యక్షుడు విష్ణు పేరిట సాగుభూమి పట్టాలు.. వారు నిరుపేదలా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు

Mohanbabu- Manchu Vishnu: ఏపీలో సాగుభూమిలేని నిరుపేదలకు కేటాయించే దరఖాస్తు పట్టాలను సినీ ప్రముఖులకు మంజూరు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నటుడు మోహన్‌బాబు (Mohanbabu), ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుల పేరిట దరఖాస్తు పట్టా భూములు మంజూరు చేసినట్టు ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డుల్లో బహిర్గతమైంది. దీంతో ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ వివరాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో (Social Media) పెట్టి ‘సినీ ప్రముఖులు కూడా నిరుపేదలా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

చిత్తూరు జిల్లా (Chittoor District) చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 412-1ఎలోని 2.79ఎకరాలను ఎం.మోహన్‌బాబు పేరిట, 412-1బిలో 1.40ఎకరాలను విష్ణు (Manchu Vishnu) పేరిట దరఖాస్తు పట్టా జారీ చేశారు. 2015లో దరఖాస్తు పట్టాలు మంజూరు చేయగా.. ఆ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనిపైౖ తహసీల్దారు శిరీషను వివరణ కోరగా.. పూర్తి వివరాలు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. 

Also Read: Mohan Babu vs Naga Srinu: మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుంది.. ? దొంగతనం నుండి కుల దూషణ.. ఎవరు కరెక్ట్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News