India Covid-19: 7కోట్లు దాటిన కరోనా టెస్టుల సంఖ్య

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేల నుంచి లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేసిన సంఖ్య 7కోట్లు దాటింది.

Last Updated : Sep 26, 2020, 10:19 AM IST
India Covid-19: 7కోట్లు దాటిన కరోనా టెస్టుల సంఖ్య

India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80వేల నుంచి లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేసిన సంఖ్య 7కోట్లు దాటింది. అయితే గత 24గంటల్లో శుక్రవారం ( సెప్టెంబరు 25న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 85,362 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,089 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,03,933 కి చేరగా.. మరణాల సంఖ్య 93,379 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,60,969 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 48,49,585 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Durgam Cheruvu Cable Bridge: భాగ్యనగరానికి మరో మణిహారం

ఏడుకోట్లు దాటిన టెస్టులు..

ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 13,41,535 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 25 వరకు మొత్తం 7,02,69,975 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా రికవరి రేటు 82.14 శాతం ఉండగా.. మరణాల రేటు 1.58 శాతం ఉంది. Also read: AP ICET-2020 ఫలితాలు విడుదల.. 78శాతం మంది ఉత్తీర్ణత

 
 

Trending News