ఘోరం: బస్సులో చెలరేగిన మంటలు...45 మంది సజీవదహనం!

బల్గేరియాలో ఘోర దుర్ఘటన సంభవించింది. ఓ బస్సులో మంటలు చెలరేగి...45 మంది సజీవదహనం అయ్యారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 12:21 PM IST
ఘోరం: బస్సులో చెలరేగిన మంటలు...45 మంది సజీవదహనం!

Bulgaria Bus Accident: బల్గేరియాలో (Bulgaria accident news) ఘోర ప్రమాదం జరిగింది. రాజధానికి దక్షిణాన హైవేపై  ఆకస్మాత్తుగా ఓ బస్సు(bus)లో  మంటలు చెలరేగాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనలో 45 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. సోఫియా(Sofia)కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురిని అధికారులు రక్షించారు. వారిని ఆస్పత్రికి తరలించారు. 

Also Read: హిందూ బాలుడి పై పాకిస్తాన్ లో అత్యాచారం.. ఆపై కిరాతకంగా హత్య

మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన బస్సు (Bus crash)..  నార్త్ మెసిడోనియా(North Macedonia)కు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఆ దేశ అధికారులు.. ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న బాధితులను పరామర్శించినట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News