Chiranjeevi: 34 సంవత్సరాల తరువాత.. మళ్లీ ఆ ముగ్గురితో చిరంజీవి!

Shalini Ajith Kumar: మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఉన్న ముగ్గురు పిల్లలు గుర్తున్నారా? దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు చిరు ని కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ముగ్గురు పిల్లలు ఎవరో గుర్తున్నారా? నిజ జీవితంలో కూడా వాళ్ళు తోబుట్టువులే. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 7, 2024, 07:06 PM IST
Chiranjeevi: 34 సంవత్సరాల తరువాత.. మళ్లీ ఆ ముగ్గురితో చిరంజీవి!

Vishwambhara Update: ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ని.. పక్కనే షూటింగ్ చేస్తున్న తమిళ్ స్టార్ హీరో అజిత్ వచ్చి.. ఈ మధ్యనే కలిసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోని కూడా సోషల్ మీడియా ద్వారా..షేర్ చేస్తూ అజిత్ తో తనకి ఉన్న బంధం గురించి చెప్పిన చిరంజీవి.. అజిత్ భార్య శాలిని కూడా తాను చేసిన సినిమాలో చిన్న పాప.. పాత్ర పోషించిందన్న విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు. 

తాజాగా ఇప్పుడు శాలిని అజిత్ కుమార్ కూడా మెగాస్టార్ ని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ ట్రెండ్ అవుతున్నాయి. శాలిని తో పాటు.. ఆమె సోదరి షామిలి, సోదరుడు రీచర్డ్ రిషి కూడా చిరంజీవిని కలిసారు. వీళ్ళిద్దరూ కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో నటించిన పిల్లలే. 

నిజజీవితంలో కూడా తోబుట్టువులైన శాలిని, షామిలీ, రీచర్డ్ రిషి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా లో కూడా నటించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఆయన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు 34 ఏళ్ల తర్వాత మళ్లీ చిరంజీవిని కలిసి కొంత సమయాన్ని గడిపారు.  

అప్పుడు, ఇప్పుడు అంటూ శాలిని అజిత్ ఆ ఫోటోను షేర్ చేస్తూ "చిరంజీవి సర్ తో లవ్లీ త్రో బ్యాక్ పిక్చర్స్" అని రాసుకొచ్చారు. అప్పుడు చిరంజీవి శ్రీదేవితో కలిసి ఈ ముగ్గురు దిగిన ఫోటోని, ప్రస్తుతం చిరు తో దిగిన ఫోటోను కలిపి అభిమానులతో పంచుకున్నారు శాలిని. మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి పక్కన చూసినందుకు అభిమానులు చాలా సంతోషించారు. శ్రీదేవి కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని కొందరు కామెంట్లు చేశారు. 

 

ఇక సినిమాల పరంగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీ గా ఉన్నారు. బింబిసారా ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, అషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా.. ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా కాకుండా చిరంజీవి మరికొద్ది సినిమాల కథలు కూడా వింటున్నట్లు తెలుస్తోంది. 

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

Read more: Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News