చికెన్, మటన్ అంటూ గుంపులుగా చేరితే మక్కిలిరుగుతాయ్..!!

టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'శివమణి'. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం మళ్లీ అందరికీ  గుర్తుకు వస్తోంది.  భవిరి రవి అనే మిమిక్రీ  ఆర్టిస్ట్ చేసిన ఓ పేరడీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడమే అందుకు కారణం.

Last Updated : Apr 26, 2020, 10:50 AM IST
చికెన్, మటన్ అంటూ గుంపులుగా చేరితే మక్కిలిరుగుతాయ్..!!

టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'శివమణి'. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం మళ్లీ అందరికీ  గుర్తుకు వస్తోంది.  భవిరి రవి అనే మిమిక్రీ  ఆర్టిస్ట్ చేసిన ఓ పేరడీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడమే అందుకు కారణం.

2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రను పోషించారు హీరో నాగార్జున. నా పేరు శివమణి... నాక్కొంచెం మెంటల్ అంటూ ఆయన చెప్పే డైలాగులు, రౌడీలను బెదిరించే తీరు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. ఇప్పుడు ఆ సినిమాలో పూర్ణా మార్కెట్ లో జరిగే సీన్ ను భవిరి రవి పేరడీగా తీర్చిదిద్దారు. 

కరోనా వైరస్ కారణంగా మాస్కులు లేకుండా తిరిగితే ఓ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ ఎలా వార్నింగ్ ఇస్తాడో భవిరి రవి చక్కగా చేసి చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో హీరో నాగార్జున కూడా దీనిపై స్పందించారు. దాదాపు 16 ఏళ్ల క్రితం చేసిన ఈ సినిమా ఇప్పుడు బాగా గుర్తుకు వస్తోందని ట్వీట్ చేశారు. ఇప్పుడు  తాను మళ్లీ శివమణి సినిమాలో నటిస్తే ..  దర్శకుడు పూరీ జగన్నాథ్ డైలాగ్స్ ఇలాగే ఉంటాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News