2.0లో రజనీకాంత్ ఎంట్రీ సీన్ కోసం.. సినిమాని ఆపేసిన ఫ్యాన్స్

   

Last Updated : Nov 29, 2018, 04:25 PM IST
2.0లో రజనీకాంత్ ఎంట్రీ సీన్ కోసం.. సినిమాని ఆపేసిన ఫ్యాన్స్

రజనీకాంత్, శంకర్ కాంబినేషనులో వచ్చిన 2.0 చిత్రం ఈ రోజే విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వచ్చే హీరో ఎంట్రీ సీన్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి కొందరు ఫ్యాన్స్ సినిమానే నిలిపివేశారు. తాము తలైవా  సినిమా రిలీజ్ అయినప్పుడల్లా.. ఆయన ఎంట్రీ సీన్‌ను సెలబ్రేట్ చేయడం ఆనవాయితీగా పాటిస్తున్నామని.. అందుకే కొంచెం సేపు సినిమాని నిలిపివేయమని వారు థియేటర్ యాజమాన్యాన్ని కోరగా.. వారు కూడా అందుకు సమ్మతించారు.  ఈ క్రమంలో సినిమాలో రజనీ ఎంట్రీ ఇవ్వగానే.. థియేటర్ వాళ్లు సినిమాని ఆపేశారు. వెంటనే రజనీ ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తూ.. రంగు పేపర్లు వెదజల్లుతూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కొందరు ధియేటర్ బయటకు వచ్చి రజనీ కటౌట్‌ని పాలతో కూడా అభిషేకం చేశారు. మరికొందరు బాణాసంచా కాల్చి కూడా హల్చల్ చేశారు. చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాలు, ముంబయి లాంటి చోట్ల రజనీ ఫ్యాన్స్ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా వేడుకలు చేసుకుంటూ ఉంటారు. ఆయన సినిమాను ఓ పండగలా జరుపుకుంటారు. 

Trending News