నేడే కుమారస్వామి కేబినెట్ ఏర్పాటు

కుమారస్వామి కేబినెట్

Last Updated : Jun 6, 2018, 12:54 AM IST
నేడే కుమారస్వామి కేబినెట్ ఏర్పాటు

కర్ణాటకలో అధికారాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్-కాంగ్రెస్ కూటమి బుధవారం కేబినెట్‌ను సైతం ఏర్పాటు చేయనుంది. మొత్తం 34 మంది సభ్యులు ఉండనున్న ఈ కేబినెట్‌లో 12 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు కాగా మిగతా 22 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఇవాళ మధ్యాహ్నం 2:12 గంటలకు ఈ ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ప్రమాణస్వీకారోత్సం పూర్తయిన అనంతరం మంత్రులకు పోర్ట్ ఫోలియోలు కేటాయించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి కేఈ రాధాకృష్ణ తెలిపారు. 

ఆర్థిక శాఖతోపాటు ఎక్సైజ్, ఇన్ ఫర్మేషన్, ఇంటెలీజెన్స్, సాధారణ పరిపాలన, ప్రణాళిక-గణాంకాలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, పవర్ కోపరేషన్, పర్యాటకం, విద్యా శాఖ, మత్య్స, పశుసంవర్ధక శాఖ, కుటీర పరిశ్రమలు, రవాణా, చిన్ననీటి పారుదల శాఖలు జేడీఎస్ ఎమ్మెల్యేలకు చెందనుండగా మిగతా కీలక శాఖలు అన్నీ కాంగ్రెస్ పార్టీ నేతల జాబితాలోకి వెళ్లనున్నాయి. 

Trending News