Maha Kumbh Mela 2025: ఉత్తర్ ప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్రాజ్లో సాగుతున్న మహా కుంభమేళా చివరిదశకు చేరుకుంది. మరో 5 రోజుల్లో ఈ మహా వేడుక ముగుస్తుంది. ఈ ఉత్సవం రావాలంటే మరో 144 సంవత్సరాలు వేచి చూడాలి. దీంతో జీవితకాలంలో వచ్చిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తున్నారు.
Maha Kumbh@50 CR: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. జనవరి 13న భోగి రోజున ప్రారంభమైన మహాకుంభ మేళా మొదలైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు త్రివేణీ సంగమంలో 50 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారినట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
154 Years Old Monk Found In Maha Kumbh Mela Video Viral: మహా కుంభమేళాలో అద్భుత సన్నివేశం ఆవిష్కృతమైంది. సాధారణంగా మానవుడి జీవిత కాలం వందేళ్లు కానీ 154 ఏళ్ల వయసు కలిగిన సాధువు ప్రత్యక్షమయ్యాడు. అతడికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Mahakumbh Mela 2025: భారతదేశ చరిత్రలోనే 12 పుష్కరాల తర్వాత అంటే 144 యేళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా గంగా,యమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లో పుష్య పౌర్ణమి (జనవరి 13) నుంచి జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 20 కోట్ట మంది మహా కుంభమేళాలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా తెలుగు వారికి సంబంధించిన శ్రేయాస్ మీడియా మహా కుంభమేళాలో భాగమైంది. అంతేకాదు అక్కడ అద్భుతమైన రామ మందిరం సెట్టింగ్ తో అందరిని అలరిస్తోంది.
Mahakumbh Mela 2025 Yogi: వరల్డ్ వైడ్ గా అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా.. 2025లో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక పండగ. ఈ నెల 13న పుష్య పౌర్ణమి రోజున మహా కుంభమేళా.. అఘోరాలు, నాగ సాదువులు, కొంత మంది పండితుల పుణ్య స్నానాలతో ప్రారంభమైంది. అయితే.. ఈ వేడుకను ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తూన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు పవిత్ర గంగా, యుమునా, సరస్వతిల సంగమ స్థానమైన త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు.
Mahakumbh Mela 2025: ఇంతకీ కుంభమేళాలో రాజస్నానానికి వచ్చే అఘోరాలకు, నాగ సాధువులు ఒక్కటనే భ్రమలో చాలా మంది ఉన్నారు. అవును వీరిద్దరు హిందూ ధర్మ రక్షణ కోసం పాటు పడేవారే. వీళ్లిద్దరిలో ఉన్న తేడాలేమిటో చూద్దాం..
Naga Sadhu: ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని గంగ, యుమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లో జరుగుతోంది. ఇక్కడ భక్తులతో పాటు సామాన్యులను అందరికీ ఆకర్షిస్తున్నారు నాగ సాధువులు.ఒక వ్యక్తి శివ గణాలుగా పిలవబడే నాగ సాధువులు కావడానికి ఎలాంటి కఠోర దీక్షలు చేస్తారు. వాటి వెనక ఉన్న మర్మం ఏమిటనే విషయానికొస్తే..
Maha Kumbhmela 2025: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తారు. భక్తులతో పాటు...సామాన్య జనం కోట్లలో ప్రయాగ్ రాజ్ కు తరలివస్తున్నారు. మరోవైపు త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు, బాబాలు వస్తున్నారు. ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 7 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క మకర సంక్రాంతి రోజునే దాదాపు మూడున్నార కోట్ల మందికిపైగా భక్తులు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
Kumbha Mela 2025 : ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పుష్య పౌర్ణమి రోజు ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర్ణమి రోజు.. రవి.. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతి రోజున పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించారు.
Kumbha Mela - Naga Sadhu: నాగ సాదువులు, అఘోరాలు శివ గణాలుగా పరిగణిస్తారు. అందులో అఘోరాలు కాల్చిన శవాలను ఆహారంగా స్వీకరిస్తారు. అంతేకాదు శ్మశానంలోని శవాల బూడిదను శివుడికి భస్మంగా పూజించడంతో పాటు ఒంటికి రాసుకుంటారు. అందులో నాగ సాదువులు ఒంటిపై నూలు పోగు లేకుండా గడ్డకట్టే చలిలో సైతం నగ్నంగా ఉంటారు. వారికి ఏమి కాదా.. దీని వెనక అసలు రహస్యం అదేనా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.