Teenmaar Mallanna: 'పార్టీ టికెట్‌పై ఎమ్మెల్సీగా గెలిచావ్‌ గుర్తుంచుకో'.. తీన్మార్‌ మల్లన్నకు షోకాజ్‌ నోటీస్‌

TPCC Issued Show Cause Notice To Teenmaar Mallanna: పార్టీకి వ్యతిరేకంగా.. రేవంత్‌ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులకు మల్లన్న ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 6, 2025, 07:23 PM IST
Teenmaar Mallanna: 'పార్టీ టికెట్‌పై ఎమ్మెల్సీగా గెలిచావ్‌ గుర్తుంచుకో'.. తీన్మార్‌ మల్లన్నకు షోకాజ్‌ నోటీస్‌

Teenmaar Mallanna: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చింతపండు నవీన్‌ కుమార్‌కు కాంగ్రెస్‌ పార్టీ భారీ షాక్‌ ఇచ్చింది. ఓ సామాజిక వర్గాన్ని దూషిస్తుండడమే కాకుండా కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా.. రేవంత్‌ రెడ్డిపై దుర్భాషలాడడం.. ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో వివరణ ఇవ్వాలని నోటీసు అందించింది. కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా సంఘం మల్లన్నకు నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

Also Read: Foreign Liquor: మద్యం ప్రియులకు జాక్‌పాట్‌.. ఒకే దుకాణం మూడు బ్రాండ్ల మద్యం

పార్టీ అగ్ర నాయకత్వం దిశానిర్దేశంతో బీసీలకు సంబంధించి కుల గణన చేపట్టినట్లు కాంగ్రెస్‌ పార్టీ క్రమ శిక్షణా సంఘం జారీ చేసిన నోటీసుల్లో గుర్తు చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బీసీ కుల గణనపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం తగదని బీసీల అంశంలో పార్టీ లైన్‌ దాటి ప్రవర్తించారని గుర్తుచేసింది. 'మీరు కాంగ్రెస్‌ పార్టీ బీ ఫారంపై వరంగల్‌-ఖమ్మం-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన విషయాన్ని మరచిపోతున్నారు' అంటూ ఒక విధంగా ఆ పార్టీ హెచ్చరించింది. ఆ విషయాన్ని మరచి ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. సరైన వివరణ ఇవ్వకపోతే పార్టీ కఠిన చర్యలకు కూడా వెనుకాడదని కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ జి.చిన్నారెడ్డి స్పష్టం చేశారు.

Also Read: KA Paul: 'ట్రంప్‌ భారతదేశ పౌరులను తరిమేస్తుంటే.. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు?

ఈ నోటీసుల్లో బీసీ కులగణనను ప్రభుత్వం ఎలా చేపట్టిందో సవివరంగా తీన్మార్‌ మల్లన్నకు వివరించింది. అలాంటి సర్వేపై విచక్షణా రహితంగా విమర్శలు చేయడమే కాకుండా కుల గణన పత్రాలను దహనం చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పటికే మంత్రులు, ఓ సామాజిక వర్గం నాయకులు మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఇంకోవైపు కొన్ని సంఘాల నాయకులు మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నోటీసులు ఇచ్చేందుకు వాళ్లెవరు? అని మల్లన్న ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ వివాదం మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News